మున్నూరు కాపులు అందరు రాజకీయంగా,ఆర్థికంగా,సామాజికంగా ఎదుగాలంటే సంఘటితమై ఐక్యతతో గ్రామ,మండల కమిటీ లు ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో బలమైన కులంగా ఎదుగలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ పిలుపునిచ్చారు. వారం రోజులు 25 నియోజకవర్గాలు ఎనిమిది జిల్లాలు పర్యటనలో భాగంగా సోమవారం ములుగు నియోజకవర్గం కో ఆర్డినేటర్ పిట్టల మధుసూదన్ పటేల్ అధ్యక్షతన మండల కో ఆర్డినేటర్ లు,ముఖ్యనాయకులు సమావేశం జరిగింది.
సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కులం ఒకే సంఘం పేరుతో గ్రామ స్థాయి మండలం స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తామని దీనికి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం కోఆర్డినేటర్, మండలం కోఆర్డినేటర్లు సహకరించాలని కోరారు. ఇది ఒక మహా యజ్ఞం అని ఒక వ్యవస్థ నిర్మాణం జరుగలంటే కొంత కులం ఐక్యతకు కృషి చేసే వారు కొంత వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని, కొంత స్వార్థం వదులు కోవాలన్నారు.
మండల కో ఆర్డినేటర్ లు గ్రామ కమిటీలను ఆయా గ్రామాల్లోని కలుపుకొని త్వరితగతిన గ్రామ,మండల కమిటీ లను పూర్తి చేయాలన్నారు. అనంతరం పటేల్స్ స్టిక్కర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ జిల్లా అధ్యక్షులు దామేర శెట్టి ఉత్తరయ్య పటేల్ మండలం కోఆర్డినేటర్ లు కందుకూరి సమ్మయ్య పటేల్,సాంబశివరావు పటేల్,మెడ ఆదినారాయణ పటేల్,సుంకరి సహదేవ్ పటేల్,రవీందర్ పటేల్,ఓం ప్రకాష్ పటేల్, మూదం వేణు పటేల్,అకుతోట చంద్రమౌళి పటేల్,లింగమూర్తి పటేల్, సిరంగి రాజ్ కుమార్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.