రాయలసీమ వరద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఘ్ణవర్థన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప లో వరదలు వస్తే ముఖ్యమంత్రి ఆదుకోలేక పోయాడని ఆయన అన్నారు. రాష్ట్రంలో వరదలు భీవత్సం సృష్టించిన సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జ్యూడిషియల్ విచారణ జరిపించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.