కార్తీక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు గుంటూరు జిల్లా నరసరాపుపేట సమీపంలోని కోటప్పకొండకు విచ్చేశారు. కుటుంబ సమేతంగా ఆయన శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్పీకర్ కుటుంబానికి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఘన స్వాగతం పలకారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి అభిషేకం అనంతరం ఆలయ అర్చకులు స్పీకర్ కి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయం చరిత్రను, తిరునాళ్ళ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి స్పీకర్ కి వివరించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామీ వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీపీ మూరబోయిన శ్రీనివాస రావు, జడ్పీటీసీ చిట్టిబాబు, కొండ లకావూరు సర్పంచ్ వెన్నపూస నాగిరెడ్డి, రొంపిచర్ల జడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి, రొంపిచర్ల ఎంపీపీ గడ్డం వెంకట్రావు- బాల నాగమ్మ, బసికాపురం సర్పంచ్ రాజేష్, ఆర్డీఓ శేషిరెడ్డి, ఎమ్మార్వో రమణా నాయక్, కోటప్పకొండ ఈవో రామ కోటి రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్ , రొంపిచర్ల వైసీపీ మండల కన్వీనర్ పచ్చవ రవీంద్ర బాబు, పుల్లారెడ్డి, మూరె రవీంద్ర రెడ్డి, ఇంజినీర్ కమలాకర్ రెడ్డి, జాన్, దానారెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.