మున్నూరు కాపులు రాజ్యాధికారం సాధించాలని, మున్నూరు కాపు సంఘం కుటుంబ సర్వే విజయవంతం చేయాలని మాజీ ఎంపిపి పాలేటి రామారావు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ ఎంపిపి పాలేటి రామారావు అధ్యక్షతన మున్నూరు కాపు సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మున్నూరు కాపు నేతలు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలలో మున్నూరు కాపుల కుటుంబ సర్వే నిర్వహించాలని కోరారు. వార్డు,గ్రామ,పట్టణ,మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.మున్నూరు కాపులు రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కోలపాటి వెంకటేశ్వర్లు,కోల నాగేశ్వరరావు,కోట్టు బాబు,ధూళిపాళ శ్రీనివాస్,ఆకుల రాము,వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్