శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణతో, పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి కె.ఎస్. రామరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబులు గవర్నర్ ను అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని గవర్నర్ దంపతులకు అందజేశారు.
next post