కరోనా రోగులకు తన సేవలను మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్టు కొనసాగిస్తున్నది.
17 వ రోజు కార్యక్రమంలో భాగంగా మొత్తం 50 మంది కరోనా వ్యాధి పీడితులకు, వైద్య సిబ్బందికి రాజన్న సిరిసిల్లా జిల్లా మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్టు ఆహార ప్యాకెట్లను అందచేసింది.
వేములవాడలోని లక్మీ గణపతి కాంప్లెక్స్ లోని ఐసోలేషన్ సెంటర్ లో నేడు ఆహారం ప్యాకెట్లు అందచేశారు.
ఈ అన్నదాన కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కుమ్మరి శంకర్ నూగూరి మహేష్ ,గొంగళ్ల రవికుమార్,డాక్టర్ రవీందర్, ప్రతాప సంపత్ , భస్మాంగి బసవరాజు , రంగుల శ్రీనివాస్, నాగుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.