తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఉప్పల్ లోని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కల్యాణపూరి కమ్యూనిటీ హాల్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రజలందరూ బతుకమ్మ చీరలు తీసుకోవాలని బతుకమ్మ పండుగను సంతోషంగా గడపాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ , మాసశేఖర్,మహమూద్,రాంచందర్, శ్యామ్ , డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుభద్ర, షేహానాజ్ , లక్ష్మి మొదలగు వారు పాల్గొన్నారు.