సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు ప్రాంతములో మై విలేజ్ ఇన్ఫర్మేషన్ యాప్ ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరుపుకునేందుకు మేళ్ళచెరువు మండల ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నట్టు మై విలేజ్ ఇన్ఫర్మేషన్ యాప్ కు సంబంధించిన లోగోను మంగళవారం మేళ్ళచెరువు శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి సన్నిధిలో నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మేళ్ళచెరువు మండలంలో ఈయాప్ ను మొదలు పెట్టడం వల్ల విద్య, వైద్య,ఆరోగ్య సదుపాయాలతో పాటు వ్యాపార లావాదేవీలు,ఇతర సమాచారం సులభముగా తెలుసుకునేందుకు వీలవుతుందని,గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆన్లైన్ లో లావాదేవీలు ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో మండల కేంద్రంలో ఈయాప్ ను వాడుకలోకి తీస్తున్నామని,ఈ యాప్ ద్వారా 18వ, తేది నుండి జరగబోయే శివరాత్రి బ్రహ్మోత్సవాలు,స్వామి వారి కళ్యాణం,ఎద్దుల పందాలను కూడా లైవ్ ద్వారా చూపించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్