సైబర్ నేరాలను అరికట్టడానికి నాగర్ కర్నూల్ ఎస్ పి తీసుకున్న చర్యలను పరిశీలించిన తెలంగాణ డిజిపి ఆ జిల్లాను సైబర్ నేరాలను అరికట్టే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.
ప్రతి గ్రామం లోని ఇద్దరు విద్యావంతులు అయిన యువకులు అదే గ్రామం లో సైబర్ వాలంటీర్లు గా పనిచేసేందుకు ఆసక్తి ఉంటే సమీప పోలీస్ స్టేషన్ కి వెళ్లి పేర్లను నమోదు చేసుకోవాలి.
అదే విధంగా సైబర్ క్రైం లతో పాటు ఆక్సిడెంట్ లు జరిగినపుడు వెంటనే స్పందించి వారికి ప్రథమ చికిత్స ఇచ్చి,హాస్పిటల్ కు తరలించి వారిని ప్రాణాపాయం నుండి కాపాడే విధంగా కూడా పని చేయాలి.
అలా ముందుకు వచ్చిన వారికి రెడ్ క్రాస్ సంస్థ, DMHO ద్వారా తగిన శిక్షణ కూడా అందిస్తారు. వాలంటీర్ల ను సెలెక్ట్ చేసిన తరువాత వారితో DGP వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారికి తగిన సూచనలు అందజేస్తారు.