గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో అతి ముఖ్యమైన నల్లకుంట డివిజన్ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలని నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ కోరారు.
ఈ మేరకు ఆమె నేడు రాష్ట్ర పురపాలక & ఐ.టి.శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. నల్లకుంట డివిజన్ లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించి చెప్పారు.
నల్లకుంట డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం తయారు చేసిన ప్రతిపాదనలను ఆమె కేటీఆర్ కు అందచేశారు. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఇందుకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తొందరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.