28.7 C
Hyderabad
April 28, 2024 09: 30 AM
Slider హైదరాబాద్

మంత్రి కేటీఆర్ తో నల్లకుంట కార్పొరేటర్ భేటీ

#MinisterKTR

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో అతి ముఖ్యమైన నల్లకుంట డివిజన్ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలని  నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ కోరారు.

ఈ మేరకు ఆమె నేడు రాష్ట్ర పురపాలక & ఐ.టి.శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. నల్లకుంట డివిజన్ లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించి చెప్పారు.

నల్లకుంట  డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం తయారు చేసిన ప్రతిపాదనలను ఆమె కేటీఆర్ కు అందచేశారు. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.

ఇందుకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తొందరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Related posts

పాఠశాల బస్సు ఢీకొని ఒకరికి గాయాలు

Satyam NEWS

సంచలనం సృష్టించిన గంధం చంద్రుడు…. విశాఖ పోస్టింగ్

Satyam NEWS

How to Buy XRP in 2023 With PayPal or Credit Card

Bhavani

Leave a Comment