30.7 C
Hyderabad
April 29, 2024 04: 43 AM
Slider ఖమ్మం

తెలంగాణ ఆఫ్ కోర్కమిటీ లో నల్లమోతు

#Tirumala Rao

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణా కీలకమైన కోర్ కమిటీ లో జిల్లా కు చెందిన నల్లమోతు తిరుమల రావు కు చోటు లభించింది.ఆఫ్ తెలంగాణా ఇన్చార్జి,డిల్లీ మాలవ్యానగర్ శాసనసభ్యులు సోమనాథ్ భారతి తెలంగాణా రాష్ట్ర నూతన కమిటీ ని ప్రకటించారు.డా.దిడ్డిసుదాకర్ కన్వీనర్ గా 11మందికోర్ కమిటీ సభ్యులను ఆయన

నియమించారు.ఇప్పటివరకు తెలంగాణా లో ఉన్నా అన్నికమిటీలు రద్దుచేసి కోర్ కమిటీ ని ప్రకటించారు.ఖమ్మంజిల్లా నుండి కోర్ కమిటీ లో స్థానం పొందిన నల్లమోతు తిరుమల రావు ఆపార్టీతరపున యంయల్సి గా పోటీచేయడం తో పాటు,ఐదేండ్లుగా ఖమ్మం జిల్లా లో ఆఫ్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.మద్యంవ్యతిరేఖ ఆందోళన, ఖమ్మం లో

ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై ఆఫ్ తరపున ఉద్యమాలు చేశారు.కవిగా,రచయిగా, జర్నలిస్టు గా, సామాజిక కార్యకర్త గా జిల్లా ప్రజలకు తెలిసిన తిరుమల రావు గడిచిన ఐదేళ్ళుగా ఆపార్టీ జిల్లా కన్వీనర్ గా పనిచేశారు.కీలకమైన తెలంగాణా కోర్ కమిటీ కి ఎన్నికైన నల్లమోతు తిరుమల రావు మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ

తెలంగాణా రాష్ట్రం లో విస్తరించడానికి శక్తివంచన లేని కృషి చేస్తామన్నారు.సామాన్యుల రాజకీయ కలలు ఒక్క ఆఫ్ పార్టీ ద్వారానే నెరవేరుతాయని అన్నారు.తిరుమలరావు నియామకం పట్ల ఆఫ్ ఖమ్మం జిల్లా నాయకులు స్వర్ణ

సుబ్బారావు,యండి గపూర్,చరపా పాపారావు దొర,గండపనేని సతీష్,గంధం పుల్లయ్య, పసుమర్తి శ్రీనివాస్ ,ఆఫ్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హమీద్ , మహిళా నాయకురాలు చల్లఆకల్పన,మండేపూడి శ్రీనివాస్ తదితరులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

Related posts

కృష్ణాష్టమికి గోపాలుడి తోపాటు గోవులను పూజిస్తే సకల పాపాలు పోతాయి

Satyam NEWS

హార్స్లీ హిల్స్ భూములు అప్పనంగా రాయిస్తే ప్రజలు బుద్ధి చెబుతారు

Satyam NEWS

తెలంగాణ నిధులు దోపిడీ చేస్తున్న కేసీఆర్

Satyam NEWS

Leave a Comment