39.2 C
Hyderabad
April 28, 2024 13: 06 PM
Slider జాతీయం

రాష్ట్రపతి ఎట్ హోమ్ కు హాజరైన నందలూరు బిడ్డ

#Gobbilla Vidyadhari

అన్నమయ్య జిల్లా నందలూరు కు చెందిన పూర్వ విద్యార్థిని, ఐఏఎస్ అధికారిణి గొబ్బిళ్ల విద్యాధరి ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత రాష్ట్రపతి ఎట్ హోమ్ కు హాజరయ్యారు. ప్రస్తుతం నెల్లూరు లో ట్రైనీ కలెక్టర్ గా పని చేస్తున్న గొబ్బిళ్ల విద్యాధరి 2020 లో ఆల్ ఇండియా 2వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్వ సైన్యాధిపతి, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని ప్రముఖులకు ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి అబ్దేల్ ఫట్టా ఎల్-సిసి, ఈజిప్ట్ ప్రెసిడెంట్,భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. గొబ్బిళ్ల విద్యాధరి తల్లీ గబ్బిళ్ళ సుజాత ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు.

Related posts

గృహ వినియోగ వస్తువుల పంపిణీ తనిఖీ

Bhavani

పిల్లలకోసం మొగుడ్ని అమ్మేసిన భోపాల్ ఆమని

Satyam NEWS

The End: బిల్ గేట్స్, భార్య మిలిందా విడాకులు

Satyam NEWS

Leave a Comment