గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమీషనర్ శివారెడ్డి పై బదిలీ వేటు వేశారు. రాష్ట్రంలో రెడ్ జోన్ గా ఉన్న గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయినందుకు శివారెడ్డిపై వేటు పడింది. ఆయనను కావలి మున్సిపాలిటీకి బదిలీ చేశారు.
కావలి మున్సిపల్ కమీషనర్ గా ఉన్న వెంకటేశ్వరరావుకు నరసరావుపేటలో పోస్టింగ్ ఇచ్చారు. నరసరావుపేట కరోనా హాట్ స్పాట్ గా మారిన విషయం తెలిసిందే.