37.2 C
Hyderabad
April 26, 2024 21: 44 PM
Slider మహబూబ్ నగర్

దుబ్బాకలో అధికార దుర్వినియోగం చేశారు

#DKAruna

దుబ్బాక ఎన్నికల్లో అధికార పార్టీ పూర్తిగా దానిపైనే కేంద్రీకరించి.. అరాచకాలను చేసింది..ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కూడా కల్పించలేదు..ఇది చూస్తున్న యువత పూర్తిగా బీజేపీ వైపు వస్తున్నారు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ వ్యాఖ్యానించారు.

సిద్దిపేట.. సిరిసిల్ల.. గజ్వెల్ మధ్యలో ఉన్న దుబ్బాకను ఇప్పటిదాకా పట్టించుకోకుండా.. ఇపుడు వరాలు కురిపించారు.. బండి సంజయ్ అరెస్టు తీరు అందరూ చూసారు.. తెలంగాణలో పూర్తి అభివృద్ధి జరిగిపోయిందని సీఎం కేసీఆర్ మాట్లాడుతారు.. కానీ  గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వుంది..

గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప.. రాష్ట్ర నిధులు లేవు…అని ఆమె అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా  మణికొండ గ్రామం లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆమె నేడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భరత మాత బిడ్డలమైతే.. మనం ఇలాంటి వ్యతిరేక శక్తులను నిలువరించి.. మోడీకి బాసటగా నిలవాలి.. సమాజంలోని చాలా రుగ్మతలకు వ్యతిరేకంగా యువత నిలవాలి. శివాజీ స్ఫూర్తిని యువత కలిగి ఉండాలి..అంటూ డి కె అరుణ పిలుపునిచ్చారు.

Related posts

కరోనా చంపేస్తుంది బయటకు రాకండి మహాప్రభో..

Satyam NEWS

పేద ప్రజల ఇండ్ల పట్టాలను తిరిగి ఇవ్వాలి

Bhavani

ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలకే అప్పగించాలి

Sub Editor

Leave a Comment