శ్రీ జ్యోతి ప్రకాష్ యువజన నాట్య కళా మండలి మఠంపల్లి వారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి పద్య నాటక,ఏక పాత్రాభినయ పోటీలు మే నెల 15,16,17వ,తేదీలలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కీర్తి శేషులు భోనగిరి ఆగ్నేశమ్మ బాల శౌరి కళా వేదికపై బుధవారం పోష్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పరిషత్తు చైర్మన్ భోనగిరి ప్రకాష్ బాబు మాట్లాడుతు అంతరించి పోతున్న జానపద,పౌరాణిక నాటకాలు, ఏకపాత్రాభినయాలు నేటి తరాలకు తెలిసేలా,నాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది, ధృఢ సంకల్పంతో నాటక పోటీలను ఏర్పాటు చేస్తున్నామని,ఇట్టి సదావకాశాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల కళా కారులు ఉపయోగించుకొని,కళాకారులు తమ తమ నాటక కౌశల్య ప్రతిభను ప్రదర్శించారని,అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పరిషత్తు ప్రధాన కార్యదర్శి బద్రంరాజు వెంకట రామారావు,సీనియర్ కళాకారులు బత్తిని ధర్మయ్య గౌడ్,భద్రయ్య చారి, బిక్షం గౌడ్,షేక్ సైదులు,షేక్ ఖాసిం,చిన్నపంగు విజయ్,భోనగిరి ఆనంద్,భోనగిరి జోస్,మెరిగ నర్సయ్య,నాగుల నర్సింహారావు,కుర్రి శ్రీను,మల్లెబోయిన గోపయ్య,మహిళ కళాకారులు నక్క వరమ్మ,సిహెచ్ రాణి తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్