భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన డీకాంగెస్టెంట్ మరియు దగ్గు సిరప్ తాగి పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది పిల్లలు మరణించారు. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ సిరప్లను ఉపయోగించవద్దని హెచ్చరిక జారీ చేసింది. దీనిపై ఢిల్లీలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విచారణకు ఆదేశించింది. హర్యానాలోని ఓ కంపెనీలో ఈ దగ్గు సిరప్లను తయారు చేస్తున్నారు.
వాటి వినియోగం వల్ల గాంబియాలో పెద్ద ఎత్తున పిల్లలు చనిపోయారని పేర్కొంది. దగ్గు మందు డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ మానవులకు విషం లాంటివని డబ్ల్యూహెచ్ఓ బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ పిల్లల మరణాలు నాలుగు డ్రగ్స్కు సంబంధించినవేనని ధృవీకరించారు.
ఈ సిరప్లు తీసుకోవడం వల్ల పిల్లల కిడ్నీలు దెబ్బతిన్నాయి. భారత ప్రభుత్వ నియంత్రణ అధికారులతో కలిసి WHO అధికారులు ఈ మందులను పరిశీలిస్తోంది. ఇందుకోసం ఈ మందుల గురించి WHO అధికారులు ప్రపంచ దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండవ తరగతి ఉత్పత్తులు సురక్షితం కాదని, ముఖ్యంగా పిల్లలలో మరణానికి కారణమవుతాయని WHO హెచ్చరించింది. ఈ మందులను మార్కెట్ నుండి తొలగించాలని WHO అన్ని దేశాలకు సమాచారం పంపింది.