2022 జనవరి 1 వతేది నాటికి నవతరంపార్టీ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పతాకావిష్కరణ, అన్నదానకార్యక్రమం నిర్వహించనున్నామని వ్యవస్థాపకులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దశాబ్ద కాలంగా ప్రజల కోసం పోరాడిన పార్టీ నవతరంపార్టీ అని తెలిపారు.ఇకముందు ప్రజల కోసం పోరాడుతామని తెలిపారు. మీడియా సమావేశంలో నవతరంపార్టీ నరసరావుపేట పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ గోదా రమేష్ కుమార్,చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ బత్తుల అనిల్ పాల్గొన్నారు.