ప్రముఖ న్యాయవాది, కమ్యూనిస్టు పార్టీ నేత సి హెచ్ ఎల్ కాంతారావు అంత్యక్రియల్లో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కాంతారావు మృతదేహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయవాదిగా కమ్యూనిస్టు యోధునిగా ఆయన సేవలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు.
నరసరావుపేటలోని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళులు తెలిపే కార్యక్రమంలో నవతరంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విఠలదేవుని గణేష్ కుమార్ పాల్గొన్నారు.