40.2 C
Hyderabad
April 29, 2024 17: 07 PM
Slider మహబూబ్ నగర్

కార్మిక పక్షపాతి నాయిని నర్సింహారెడ్డి మృతి తీరనిలోటు

#JupallyKrishnarao

1969లో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొని మలిదశ పోరాటంలో సీఎం కేసీఆర్ కి అత్యంత ఆత్మీయుడుగా వ్యవహరించిన మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని వారి మరణం ఒక్క హైదరాబాద్ కే గాక యావత్ తెలంగాణ కె తీరనిలోటని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతూ కొల్లాపూర్ పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయిని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారి సేవలను పలువురు గుర్తు చేశారు. కార్మికుల హక్కులకోసం ఎన్నో పోరాటాలు చేసి వారికి ప్రభుత్వ పరంగా సంక్షేమ ఫలాలు అందేలా కృషిచేసారని తెలంగాణ రాష్టంలో హోమ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి నిబద్ధతతో వ్యవహరించేవారని మజీ మంత్రి జూపల్లి అన్నారు.

ఆకారం కంఠం గంభీరంగా ఉన్నా అందరితో ఆప్యాయతతో ఉండేవారని జూపల్లి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అచ్చేదిన్ అంటే ఇదేనా ? అధిక ధరలతో ప్రజలు చస్తుంటే…

Satyam NEWS

గురుకుల విద్యార్థినులు అస్వస్థతకు గురైనా పట్టించుకోరా?

Satyam NEWS

19 మంది పోలీసులకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment