సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రంలో నూతన DTDC కొరియర్, ఫోటో స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారులు ప్రజలకు నమ్మకమైన సేవలు అందించాలని, చిరు వ్యాపారులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు.
అనంతరం గరిడేపల్లి, పొనుగోడు గ్రామాలలో కనకదుర్గమ్మ మాలధారణ భక్తులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు సైదిరెడ్డిని పట్టువస్త్రాలతో సన్మానించారు. సమర్పించారు. అనంతరం పోనుగొడు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడెం వెంకట రెడ్డి, ఎంపిపి పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ త్రిపురం సీతారాం రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జోగు అరవింద రెడ్డి, ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ పాల్గొన్నారు.