28.7 C
Hyderabad
April 26, 2024 07: 55 AM
Slider ఆధ్యాత్మికం

ఎస్వీబీసీ నుంచి పాత సీఈవో అవుట్ కొత్త సీఈవో ఇన్

#SVBCChannel

ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన అయోధ్య రామాలయ భూమిపూజను లైవ్ టెలికాస్ట్ చేయకపోవడంతో చెలరేగిన వివాదంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే ఎస్వీబీసీ ఛానెల్ సీఈవో ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.

 అయోధ్య రామాలయ భూమి పూజను ఎస్వీబీసీ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతల ఆగ్రహం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీఈవో ను తీసేసింది.

ఆయన స్థానంలో కొత్తగా సీఈవోగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సురేష్ కుమార్‌ను కొత్త సీఈవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో ఈరోజు సురేష్‌ కుమార్ ఎస్వీబీసీ సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు. టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏ.వీ.ధర్మా రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

Related posts

నవోదయ కు ఎంపికైన ములుగు సెయింట్ ఆంథోనీస్ విద్యార్ధులు 

Satyam NEWS

16న మద్యం దుకాణాలు బంద్

Bhavani

వనపర్తి పట్టణంలో భూ మాఫియాను అరికట్టాలి

Satyam NEWS

Leave a Comment