హైదరాబాద్ అంబర్ పేట నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ లో రోడ్డు పనులను అంబర్ పేట్ MLA కాలేరు వెంకటేష్ ప్రారంభించారు.
డ్రైనేజ్ పైప్ లైన్స్ వేయించిన సందర్బంగా పాడయిన తిలక్ నగర్ బస్తీలో రోడ్డు పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి.
మొత్తం సుమారు 6 లక్షల రూపాయలు GHMC మంజూరు చేయగా నూతన CC రోడ్డు పనులను అంబర్ పేట్ MLA కాలేరు వెంకటేష్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో GHMC నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ స్థానిక బస్తి నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ నల్లకుంట డివిజన్ లో విడతల వారీగా నూతన రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.
వర్షాల వల్ల, పెద్ద వాహనాలు తిరగడం వల్ల పాడైపోయిన రోడ్లు గుర్తించి నూతన రోడ్లకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.
అతి త్వరలో ఆ పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ Ch.భగవాన్, రాజ్ గౌడ్, రవి, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇంకా, బత్తుల రవి, జగన్, యాదగిరి, నర్సింగ్ రావు, వెంకటేష్, జిహెచ్ ఎంసి డిఈ సంతోష్, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్ తదితరులు కూడా పాల్గొన్నారు.