ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ లో కౌండిన్య గౌడ యువజన సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి , హోసింగ్ బోర్డు మీర్పేట్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ లు కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి , దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, ఈ దేశంలో కుల వృత్తులను ప్రోత్సహించడం సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని అన్నారు. ఇప్పటికే నీరా అమ్మకాలను కేవలం గౌడ కులస్థులకు మాత్రమే కేటాయించి చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం, మద్యం దుకాణాల్లో గౌడులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించి మరో చారిత్రక నిర్ణయానికి శ్రీకారం చుట్టారన్నారు, వ్యాపారాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ దళిత బహుజనులకు ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ నాటి సర్వాయి పాపన్న ఆశయాలను సీఎం తీర్చుతున్నాడని కొనియాడారు. కార్యక్రమంలో గౌడ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి