ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనను తొలగిస్తూ జారీ చేసిన జీవో రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన తరఫున న్యాయవాది అశ్వనీకుమర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
previous post