40.2 C
Hyderabad
April 29, 2024 17: 33 PM
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా ఇవ్వాళ కాకపోతే రేపు పోతుంది మరి కులం?

andhra pradesh

కరోనా వైరస్ ప్రపంచాన్ని తొలిచివేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను మార్చే పనిలో బిజీగా ఉంది. చివరకు మార్చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారా? చెప్పాలంటేనే సిగ్గుగా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితుడైన జస్టిస్ వి కనగరాజ్ ఏ కులం అని వెతుకుతున్నారు.

నిజం. ఇదేం అబద్ధం కాదు. జస్టిస్ వి కనగరాజ్ నియమితుడైనట్లు వార్త వెలువడ్డ మరుక్షణం నుంచి గూగుల్ సెర్చిలో టాప్ సెర్చస్ లో వచ్చింది జస్టిస్ కనగరాజ్ ఏ కులానికి చెందిన వాడు అని. గూగుల్ ట్రెండ్స్ చూస్తే కనగరాజ్ కులం పేరుతో టాప్ సెర్చిలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణ లో కూడా ఆంధ్రావాళ్లు ఉంటారు కదా వారు కూడా కనగరాజ్ కులం గురించే వెతికారు. ఈ కులం పిచ్చి తగలబడ. రాష్ట్రం తగలబడుతున్నా అధికార పక్షం, ప్రతిపక్షం ఈ రెంటితో బాటు ప్రజలూ కూడా కులం గురించే చచ్చిపోతున్నారు.

Related posts

చంద్రబాబునాయుడిని ఎవరూ అరెస్టు చేయలేదు

Satyam NEWS

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఉక్కుపాదం

Satyam NEWS

జగన్ ఎలా దోచేస్తున్నాడనేది ప్రజలు తెలుసుకోవాలి

Satyam NEWS

Leave a Comment