కరోనా వైరస్ ప్రపంచాన్ని తొలిచివేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను మార్చే పనిలో బిజీగా ఉంది. చివరకు మార్చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారా? చెప్పాలంటేనే సిగ్గుగా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితుడైన జస్టిస్ వి కనగరాజ్ ఏ కులం అని వెతుకుతున్నారు.
నిజం. ఇదేం అబద్ధం కాదు. జస్టిస్ వి కనగరాజ్ నియమితుడైనట్లు వార్త వెలువడ్డ మరుక్షణం నుంచి గూగుల్ సెర్చిలో టాప్ సెర్చస్ లో వచ్చింది జస్టిస్ కనగరాజ్ ఏ కులానికి చెందిన వాడు అని. గూగుల్ ట్రెండ్స్ చూస్తే కనగరాజ్ కులం పేరుతో టాప్ సెర్చిలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణ లో కూడా ఆంధ్రావాళ్లు ఉంటారు కదా వారు కూడా కనగరాజ్ కులం గురించే వెతికారు. ఈ కులం పిచ్చి తగలబడ. రాష్ట్రం తగలబడుతున్నా అధికార పక్షం, ప్రతిపక్షం ఈ రెంటితో బాటు ప్రజలూ కూడా కులం గురించే చచ్చిపోతున్నారు.