ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ తన విధులు నిర్వర్తించేందుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అనుమతినిచ్చారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు గవర్నర్ ను కలిసి రమేష్ కుమార్ వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే.
దీనిపై గవర్నర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠకు తెర దించుతూ ఆయన రమేష్ కుమార్ పట్ల సానుకూల నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేయాలని గవర్నర్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.