సమాజంలో విలేకరులకు స్వేచ్ఛ లేదని వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి చెప్పారు. వనపర్తిలో రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జడ్పి చైర్మన్ విలేకరులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు,ప్రజాప్రతినిధులకు సౌకర్యం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విలేకరుల సేవలు అవసరమని ఆయన తెలిపారు. సీనియర్ విలేకరులను సన్మానించారు. ఉద్యోగుల కోసం డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, అలాగే ఎమ్యెల్సిని కేటాయించాలని రిటైర్ ఉద్యోగుల సంఘం నేతలు కోరారు.సన్మానం పొందిన వారిలో సీనియర్ విలేకరి పోలిశెట్టి బాలకృష్ణ ఉన్నారు.
previous post
next post