40.2 C
Hyderabad
April 28, 2024 16: 44 PM
Slider కర్నూలు

ఏ మాత్రం అవగాహనలేని సీఎం ఈ జగన్ రెడ్డి

#vishnuvardhanreddy

డబ్బులు ముద్రించే మిషన్ కేంద్రం వద్ద ఉంటుందని చెబుతున్న సీఎం జగన్ కు కనీస అవగాహన కూడా లేదని మరొక్కమారు నిరూపించుకున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు. సీఎం జగన్ వరద ప్రాంతాల పర్యటనలో ఈ అసందర్భ వ్యాఖ్యలు చేశారు…ఇది సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

సీఎం జగన్ వరద ప్రాంతాలకు విహారాయాత్రకు వెళ్లినట్టు వెళ్లారు…తప్ప ఏ మాత్రం సాయం చేయలేదు అని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.  పోలవరం ముంపు బాధితులకు  కేంద్రం ఇచ్చిన ఇళ్లు జగన్ రెడ్డి ఎందుకు నిర్మించలేదు అని ఆయన ప్రశ్నించారు. ఊర్లు కట్టిస్తామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం పోలవరం ముంపు బాధితులకు ఇల్లు ఎందుకు నిర్మించలేదు అని ఆయన ప్రశ్నలు గుప్పించారు.

వైసీపీ ప్రభుత్వం కమీషన్ల ప్రభుత్వమని జగన్ రెడ్డి చెప్పలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రాంతీయపార్టీలు రాష్ట్రానికి దరిద్రం….ఓటు బ్యాంకు రాజకీయాలు రాష్ట్రాలను గాలికొదిలేసాయి అని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రాంతీయపార్టీలు పోవాలి, బీజేపీ రావాలి అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన తెలిపారు.

Related posts

వెన్నుపోటు వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య

Satyam NEWS

రాణిగారి గదిలో దెయ్యం ట్రైలర్‌ ఆవిష్కరణ

Satyam NEWS

శ్రీకాకుళంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కరోనా కలకలం..

Sub Editor

Leave a Comment