సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఫణిగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి గట్టు వద్ద గల కాలనీ వాసులు 250 కుటుంబాలు యం.పి.కెప్టన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సైదిరెడ్డి బెదిరింపులకు ఎవరు భయపడొద్దని అన్నారు. రామస్వామి గట్టు వద్ద 2,163 ఇండ్లు తన హయాంలో కట్టిస్తే ఆ ఇండ్లను డంపింగ్ యార్డుగా మార్చిన చరిత్ర శానంపూడి సైదిరెడ్డి దని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని,అర్హులైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,3వ,వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గల్లా వెంకటేశ్వర్లు,రవి నాయక్,పోతన బోయిన రామమూర్తి, ఆదెర్ల శ్రీనివాస రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్