ఏపీ హైకోర్టును అమరావతి నుంచి మార్చే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్లో లేదని కూడా కేంద్రం తేల్చి చెప్పింది. 2019 జనవరిలో రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా ఏపీ హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారని కేంద్రం తెలిపింది. అదే విధంగా ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్ని విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేశారని కూడా వెల్లడించారు.
అయితే 2020 ఫిబ్రవరిలో హైకోర్టును కర్నూలుకు మార్చాలని సీఎం ప్రతిపాదించారు. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ బదిలీ సంబంధిత హైకోర్టుతో సంప్రదిస్తుంది. హైకోర్టుతో సంప్రదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. హైకోర్టు నిర్వహణ ఖర్చు భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది.