మున్సిపాలిటీ కార్మికులకు ఆరు నెలల నుంచి, ఆరోగ్య సిబ్బందికి ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వడానికి గతిలేని జగన్ రెడ్డి ప్రభుత్వం ఏకగ్రీవాలకు లక్షల నజరానా ఇస్తుందా అని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బాత్యాల చెంగల రాయుడు ప్రశ్నించారు.
కడప జిల్లా రాజంపేట టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట ఎమ్మెల్యే సొంత మండలంలో రోడ్లు వేయలేని వారు గ్రామాలు ఎలా బాగుపరుస్తారని ప్రశ్నించారు.
మున్సిపాలిటీ కార్మికులకు ఆరునెలల నుంచి ఏడు నెలల నుంచి ఆరోగ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి గతిలేని వారు,ఏకగ్రీవాలకు లక్షల నజరానా ఇస్తారా అని ప్రశ్నించారు.
గత ఎంపిటిసి ఎన్నికల్లో దొంగ నాటకాలు ఆడి 24 పర్సెంటేజ్ ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. ఇంకా ఎక్కువ ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేసి కోవిడ్ మూలంగా ఎన్నికలు వాయిదా పడి వారి ఆటలు సాగలేదన్నారు.
గత ఎలెక్షన్ అధికారులు వైసీపీ ఎజెంట్లుగా పని చేశారనిప్రతి పక్షాల నామినేషన్ల ను గందరగోళం సృష్టించి తిరస్కరణకు గురిఅయ్యేలా చేశారని ఆరోపించారు. దమ్ముంటే ప్రభుత్వం సాధారణంగా నామినేషన్ తో పాటూగా ఆన్లైన్ నామినేషన్ కు ముందుకు రావాలని సవాల్ విసిరారు.