39.2 C
Hyderabad
May 3, 2024 11: 03 AM
Slider కడప

జీతాలు ఇవ్వడానికి గతి లేదు… ఏకగ్రీవాలకు లక్షల నజరానా…?

#Batyana29

మున్సిపాలిటీ కార్మికులకు ఆరు నెలల నుంచి, ఆరోగ్య సిబ్బందికి ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వడానికి గతిలేని జగన్ రెడ్డి ప్రభుత్వం ఏకగ్రీవాలకు లక్షల నజరానా ఇస్తుందా అని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బాత్యాల చెంగల రాయుడు ప్రశ్నించారు.

కడప జిల్లా రాజంపేట టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట ఎమ్మెల్యే సొంత మండలంలో రోడ్లు వేయలేని వారు గ్రామాలు ఎలా బాగుపరుస్తారని ప్రశ్నించారు.

మున్సిపాలిటీ కార్మికులకు ఆరునెలల నుంచి ఏడు నెలల నుంచి ఆరోగ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి గతిలేని వారు,ఏకగ్రీవాలకు లక్షల నజరానా ఇస్తారా అని ప్రశ్నించారు.

గత ఎంపిటిసి ఎన్నికల్లో దొంగ నాటకాలు ఆడి 24 పర్సెంటేజ్ ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. ఇంకా ఎక్కువ ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేసి కోవిడ్ మూలంగా ఎన్నికలు వాయిదా పడి వారి ఆటలు సాగలేదన్నారు.

గత ఎలెక్షన్ అధికారులు వైసీపీ ఎజెంట్లుగా పని చేశారనిప్రతి పక్షాల నామినేషన్ల ను గందరగోళం సృష్టించి తిరస్కరణకు గురిఅయ్యేలా చేశారని ఆరోపించారు. దమ్ముంటే ప్రభుత్వం సాధారణంగా నామినేషన్ తో పాటూగా ఆన్లైన్ నామినేషన్ కు ముందుకు రావాలని సవాల్ విసిరారు.

Related posts

హరిహర క్షేత్ర మహాపడిపూజలో మంత్రి ఐకె రెడ్డి

Satyam NEWS

వచ్చే ఏడాది లో 500కోట్ల తో 150  పడకల వైద్య కళాశాల ప్రారంభం

Satyam NEWS

రాములవారి కల్యాణోత్సవంలో అలరించిన భజన సంగీతం

Satyam NEWS

Leave a Comment