కడప రైల్వే స్టేషన్ లో గూడ్స్ పట్టాలు తప్పిన ఘటనలో ఆరుగురిని సస్పెండ్ చేస్తూ గుంతకల్లు రైల్వే సీనియర్ డీఓఎం శ్రావణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 9న నంద్యాల డెమో రైలు పట్టాలు తప్పింది. నెల లోపలే రెండు సంఘటనలు జరగడంతో విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఆరుగురిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇందులో కడప స్టేషన్ మేనేజర్ డి. నరసింహా రెడ్డి, డిప్యూటీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి, స్టేషన్ సూపరింటెండెంట్ లాల్ బాబు సింగ్, సీనియర్ జీటీఎం ఖాసిం, పాయింట్స్ ఉమెన్ శాంతి, పాయింట్స్ మెన్ ప్రతాప్ ల ను సస్పెండ్ చేశారు. అనుమతి లేకుండా ఎవరూ కడప నుంచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు.