జిహెచ్ఎంసి ఎన్నికలకు నామినేషన్లు ముగిసిన నాటికి (శుక్ర వారం) మొత్తం 1932 మంది అభ్యర్థులు 2602 నామినేషన్లు దాఖలు చేశారు.
పూర్తి సమాచారం మేరకు, నేడు ఒక్కరోజే 1412 మంది అభ్యర్థులచే 1937 నామినేషన్లు దాకలయ్యాయి.
నేడు నామినేషన్లు దాఖలు చేసినవారిలో బి.జె.పి నుండి 571 మంది, సి.పి.ఐ నుండి 21, సి.పి.ఐ(ఎం) నుండి 22, కాంగ్రెస్ నుండి 372,
ఎం.ఐ.ఎం నుండి 78, టి.ఆర్.ఎస్ నుండి 557 మంది, టి.డి.పి నుండి 206, రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 115 మంది, స్వతంత్రులు 650 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
కాగా రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.