అంబర్ పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ లోని ఛే నంబర్ చౌరస్తాలో ఎలాంటి అనుమతి లేకుండా శ్రీ చైతన్య విద్యా సంస్థ నడుపుతున్నారు. ఈ విషయంపై అంబర్పేట్ నియోజకవర్గ సామాజిక నాయకుడు న్యాయపట్టబద్రుడు శ్రీకాంత్ ఆ విద్యా సంస్థపై జిహెచ్ఎంసి ఎఎంఓహెచ్ కు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థకు నోటీసులు అoదజేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేకుంటే చట్టమారమైన చర్యలు తప్పవని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ అంబర్పేట్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందని వారిని ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు ఐఐటీ సీఓ, ఐ పి ఎల్ పేరుతో వలవేసి లక్షలో ఫీజు దోపిడీ చేస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా విద్యాసంస్థ ఏర్పాటు చేశారని అన్నారు. వెంటనే శ్రీ చైతన్య విద్యా సంస్థను అంబర్పేట్ నియోజకవర్గంలో నుంచి తరలించి వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
సత్యం న్యూస్, అంబర్పేట్