38.2 C
Hyderabad
April 29, 2024 15: 00 PM
Slider ఖమ్మం

ఇక ఆత్మీయ సమ్మేళనాలు

#ajay

రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలను  శ్రేణులు విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  కోరారు. మళ్ళీ  పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా శ్రేణులు సన్నద్ధం కావాలని కోరుతూ ముఖ్యులతో మంత్రి పువ్వాడ సమావేశం నిర్వహించారు. ఈ ఆదివారం నుండి ప్రతి వారం టౌన్ ల వారీగా నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలన్నారు. మొదటి వారం 1టౌన్, రెండవ వారం 2వ టౌన్, తరువాత 3వ టౌన్, ఖానాపూరం హవేలీ, రఘునాథపాలెం మండలం వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా టౌన్ లలో ఉన్న అన్ని శాఖలు, అనుబంధ సంఘాలు, కుల సంఘాలు, ప్రతి క్రియాశీల సభ్యుడు ఆయా సమావేశంలో తప్పక పాల్గొనేలా డివిజన్ బాధ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఅర్  మళ్ళీ ముఖ్యమంత్రి గా చేసుకుని హ్యాట్రిక్ కొట్టే విధంగా శ్రేణులందరు సన్నద్ధంకావాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీకీ కార్యకర్తలే బలం అని, కింది స్థాయిలో పని చేసే కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Related posts

ఆన్లైన్ ట్రేడింగ్ గొడవ.. ఇద్దరు కిడ్నాప్

Satyam NEWS

కడప నగరంలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన

Satyam NEWS

తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లు మూత

Satyam NEWS

Leave a Comment