38.2 C
Hyderabad
April 29, 2024 13: 30 PM
ఆంధ్రప్రదేశ్

బార్ల లైసెన్సులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

Bar1

రాష్ట్రవ్యాప్తంగా బార్ల లైసెన్సులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంవచ్చే జనవరి ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్లపాటు లైసెన్సులు జారీ చేస్తారు. మున్సిపల్ కార్పోరేషన్ లు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీలు యూనిట్ గా బార్లు కేటాయింపు ఉంటుంది. కార్పొరేషన్లలో దరఖాస్తు ఫీజు 4లక్షల 50 వేలు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీలలో ఫీజు 2 లక్షలుగా నిర్ధారించారు.

విజయవాడ,విశాఖలో దరఖాస్తు ఫీజు 7 లక్షలుగా ఉంటుంది. అదే విధంగా 98 చోట్ల ఏడాదికి లైసెన్సు ఫీజు 5 లక్షలుగా ప్రభుత్వం నిర్ధారించింది. ఇవాల్టి నుంచి వచ్చే నెల 6 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్లు లాటరీ తీస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల కల్లా బార్ల కేటాయింపు జాబితా విడుదల చేస్తారు.

Related posts

మద్యం అమ్మాలని ప్రధాని మోడీ చెప్పలేదు

Satyam NEWS

పల్నాడు పాపం ఎవరిది చంద్రబాబూ?

Satyam NEWS

నాగార్జునసాగర్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment