ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మాలని ప్రధాని నరేంద్రమోడీ చెప్పడం వల్లే అమ్ముతున్నారని రాష్ట్ర మంత్రి పేర్ని నాని చెప్పడాన్ని ఖండిస్తున్నామని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ మద్యం అమ్ముకోవాలని ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు.
ప్రధాని ఇచ్చిన ఆదేశాలు అయితే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఎందుకు అమ్మడం లేదని ఆయన ప్రశ్నించారు. మద్యం అమ్మకాలపై వ్యతిరేకత రాగానే కేంద్రం పైకి నెపం నెట్టడం మంచి పని కాదని జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రాలు మద్యం అమ్ముకుంటే ఆదాయం రాష్ట్రానికే వస్తుందని, దానితో కేంద్రానికి సంబంధం లేదని ఆయన అన్నారు.