వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) ఏటూరు నాగారం మండల కమిటీ ఎన్నికున్నారు. ఏటూరునాగారంలో నిర్వహించిన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ముఖ్యకార్యకర్తల సమావేశానికి కొలసాని నాగేంద్ర అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన NPRD ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి Sd ఖాజామొయినోద్దీన్ మాట్లాడుతూ మండలంలోని వికలాంగుల పింఛన్లు బ్యాంకు ఖాతాల ద్వారా కూడా అందించాలని అదేవిధంగా అర్హులైన వికలాంగులకు జీవనోపాధి కోసం స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు అందించాలని, గతంలో మంజూరై పెండింగ్ లో ఉన్నరుణాలను వెంటనే విడుదల చేయాలని ఏజెన్సీ ప్రాంత వికలాంగుల కోసం స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వికలాంగులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్నికోరారు.
సంబంధిత వికలాంగుల సంక్షేమ అధికారులు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని వికలాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. అనంతరం ఏటూరునాగారం మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షురాలిగా రామన్నగూడెం గ్రామానికి చెందిన పల్నాటి నాగలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శిగా వంగరి రామ్మూర్తిని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఎండీ. ఫరూక్ అలీ, శివనేని గీత, గద్దెల బానయ్య, సాంబయ్య, రమేష్, నాగేశ్వరరావు, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.