జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు, మంత్రి పేర్ని నాని చిత్ర పటాన్ని జన సేన కార్యకర్తలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కడపజిల్లా రాజంపేట పాత బస్ స్టాండ్ కూడలి లో జన సేన కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
మంత్రి పేర్ని నాని చిత్ర పటంతో బాటు మంత్రులు బొత్సా సత్యనారాయణ, వెల్లంపల్లె శ్రీనివాస్ ల చిత్రపటాలు కూడా దగ్ధం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ చిత్ర పటాన్ని కూడా తగలబెట్టిన జనసైనికుల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.