రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో పల్లె వెలుగు, సిటీ సర్వీస్లు ఖమ్మం పాత బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యాయి. ప్రజల సౌకర్యార్థం పూర్తి సిటీ సర్వీసులు, పల్లె వెలుగు సర్వీస్లు ఖమ్మం పాత బస్టాండ్ నుంచి అందుబాటులోకి వచ్చాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు అన్ని విధాలుగా ప్రజల సౌకర్యార్థం దీనిని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అదేవిధంగా కొత్త బస్టాండ్ నుండి కూడా యధావిధిగా సర్వీసులు నడుస్తాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటినుండి ఖమ్మంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడిందని నగర ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం పాత బస్ స్టాండ్ కు పూర్వ వైభవం వచ్చిన నేపథ్యంలో ఖమ్మం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
previous post
next post