రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి ఇంటికి 10 లక్షలు అందే వరకు కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి కోరారు.
టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి ఆగస్టు 9 నుండి సెప్టెంబర్ 17 వరకు దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోర కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.
ప్రజల పక్షాన, ప్రభుత్వాల మెడలు వంచేలా, ఒక్క హుజురాబాద్ నియోజకవర్గం దళితులకు మాత్రమే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం దళిత, గిరిజన కుటంబాలకు దళిత- గిరిజన బంధు ద్వారా 10 లక్షల రూపాయలు అందించాలని కోరుతూ పోరాటం చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఆయనకు బాసటగా నిలిచిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊరూరా దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోర కార్యక్రమాన్ని నిర్వహించాలని కుమారస్వామి కోరారు.గడప, గడపకు తిరిగి విజయవంతం చేయాలని ఆయన కోరారు.