కొందరు యువకులు ఫుల్లుగా తాగారు. వారిలో వారు గొడవ పడ్డారు. వారి గొడవను చూసి అలా చేయవద్దంటూ పెద్దలు మందలించారు. అంత వరకూ బాగానే ఉంది కానీ మద్యం మత్తులో ఉన్న వారు పెద్దల మాటలకు తీవ్రంగా బాధపడ్డారు. అందులో ఒక యువకుడు యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తిరుపతి నగరంలోని తాతయ్య గుంట లో ఈ ఘటన జరిగింది. మృతుడు మహేష్ రెడ్డి గా ఈస్ట్ పోలీసులు గుర్తించారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.