లాక్ డౌన్ పరిస్థితి ఎలా ఉందని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేడు నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. నిర్మల్ పట్టణంలో ప్రజల ను ఆయన నేడు నేరుగా కలుసుకున్నారు. ప్రతి ఒకరు మాస్కులు ధరించు కోవాలని, గుంపులు గా ఉండరాదని పలు జాగ్రత్త లు పాటించాలని మంత్రి ప్రజలకు తెలిపారు.
ఈ సందర్బంగా కూరగాయల, పండ్ల,కిరాణా వ్యాపారులకు మంత్రి మాస్కుల ను అందజేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, SP శశిధర్ రాజు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.