42.2 C
Hyderabad
April 26, 2024 15: 29 PM
Slider కృష్ణ

అనుమతి ఇవ్వకపోయినా వినాయకచవితి జరుపుకుంటాం

#VHPVijayawada

ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా వినాయకుని పండుగ చేసుకుందాం అని నినాదాలు చేస్తూ విజయవాడ మహానగర్ విశ్వహిందూ పరిషత్ నేడు పాదయాత్ర చేసింది.

సత్యనారాయణపురం VHP కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేసి, సాయంత్రం 5 గంటలకు పాదయాత్రగా, 1 టౌన్ శ్రీ వినాయకుని గుడి వరకు వెళ్ళి , స్వామికి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నా, పాదయాత్రలో VHP విజయవాడ మహానగర్ అధ్యక్షులు సాన శ్రీనివాస్, కార్యదర్శి P.రాఘవరాజు, కోశాధికారి P.రవీంద్ర గుప్తా, చల్లా లక్ష్మీనారాయణజీ, నాగలింగ శివాజీ, నగర భజరంగ్ దళ్ ప్రముఖ్ A.శివప్రసాద్, రాధా మనోహర్ దాస్ తో పాటు పలు స్వామీజీలు , పలు హిందూ సంస్థలు, వినాయకచవితి పండుగ పైన ఆధారపడి , పూలు , పండ్లు , పూజా సామాగ్రి , మట్టి వినాయకుని ప్రతిమలు అమ్ముకుని జీవిస్తున్న సామాన్య ప్రజలు, లైటింగు , మైకు , మేళతాళాల వారు కూడా పాల్గొన్నారు.

పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వినాయకచవితి పండుగకు అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండు చేశారు.

Related posts

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘనంగా నివాళులు

Satyam NEWS

ఎంపి మాధవ్ పై పరువు నష్టం దావా వేస్తున్న రాధాకృష్ణ

Satyam NEWS

ఏపి అవినీతి నిరోధక శాఖ డీజీ ఆకస్మిక బదిలీ

Satyam NEWS

Leave a Comment