ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా వినాయకుని పండుగ చేసుకుందాం అని నినాదాలు చేస్తూ విజయవాడ మహానగర్ విశ్వహిందూ పరిషత్ నేడు పాదయాత్ర చేసింది.
సత్యనారాయణపురం VHP కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేసి, సాయంత్రం 5 గంటలకు పాదయాత్రగా, 1 టౌన్ శ్రీ వినాయకుని గుడి వరకు వెళ్ళి , స్వామికి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నా, పాదయాత్రలో VHP విజయవాడ మహానగర్ అధ్యక్షులు సాన శ్రీనివాస్, కార్యదర్శి P.రాఘవరాజు, కోశాధికారి P.రవీంద్ర గుప్తా, చల్లా లక్ష్మీనారాయణజీ, నాగలింగ శివాజీ, నగర భజరంగ్ దళ్ ప్రముఖ్ A.శివప్రసాద్, రాధా మనోహర్ దాస్ తో పాటు పలు స్వామీజీలు , పలు హిందూ సంస్థలు, వినాయకచవితి పండుగ పైన ఆధారపడి , పూలు , పండ్లు , పూజా సామాగ్రి , మట్టి వినాయకుని ప్రతిమలు అమ్ముకుని జీవిస్తున్న సామాన్య ప్రజలు, లైటింగు , మైకు , మేళతాళాల వారు కూడా పాల్గొన్నారు.
పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వినాయకచవితి పండుగకు అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండు చేశారు.