ఓ అనాధ అమ్మాయికి పెళ్లి కోసం, మరొక అనాధ అబ్బాయికి ఇల్లు నిర్మాణం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని ఉప్పల వెంకటేష్ అందజేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జంగారెడ్డి పల్లి గ్రామంలో తల్లిదండ్రులు చనిపోయి అనాధగా ఉన్న స్వప్న వివాహానికి 15వ వేల రూపాయలు ఆర్థిక సాయం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అందజేశారు.
అదేవిధంగా కడ్తాల్ మండలం రావిచెడు గ్రామానికి చెందిన సాయిరాం తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ పెంపకంలో సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న ఆయనకు ఇంటి నిర్మాణం కోసం తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు సాయిరాం తెలిపారు.అనాధలైన ఇరువురు అశ్రునయనాలతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, చేకూరి రాజు రమేష్ శేఖర్ కృష్ణయ్య తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.