పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని సమాచారంతో ఒక వ్యక్తిని మావోయిస్టులు కాల్చి చంపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో సబ్క గోపాల్( 45 సంవత్సరాలు) అనే వ్యక్తి ని మావోయిస్టులు కాల్చి చంపారు. పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఇదే శిక్ష పడుతుందని, సభ్క గోపాల్ అనే వ్యక్తి పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారడం తోనే అతనిని హతమార్చినట్లు వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు కరపత్రాన్ని విడుదల చేశారు.
previous post