నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యాటక ప్రాంతమైన మల్లెల తీర్థం జలపాతాల్లో ఒక యువకుడు గల్లంతయ్యారు. హైదరాబాదులోని లింగంపల్లి ప్రాంతానికి చెందిన ఐదుగురు స్నేహితులు నల్లమల్ల అటవీ ప్రాంతం శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రకృతి అందాలను తిలకించేందుకు రాగా తిరుగు ప్రయాణంలో అమ్రాబాద్ మండలం మల్లెల తీర్థం జలపాతాలను చేరుకున్నారు. అందులో ఒకరు ఆరిఫ్ 22 కాలుజారి జలపాతాల్లో పడిపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు ఎంత ప్రయత్నించినా కాపడలేకపోయారు. వారిలో ఎవరికి ఈత రాకపోవడంతో నీటిలో దిగటానికి ఎవరు సాహసించలేదు. స్నేహితుడి మృతితో కన్నీరు మున్నీరు అవుతున్నారు.