ఒంగోలు మున్సిపల్ ఆర్ ఐ. కత్తి లక్ష్మీ నరశింహ శంకర్ బాబు లంచం తీసుకోంటూ అవినీతి నిరోధక అధికారులకు రెడ్ హ్యాండ్ గా దొరికిపోయారు. ఒంగోలు లోని స్ధానిక రామ్ నగర్ మొదటి లైన్ రామ్ బాగీచ్చా అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ 401, 402 టైటిల్ డీడ్ మరియు ప్రాపర్టీ టాక్స్ మార్చుటకు గాను పది వేల రూపాయలు లంచం అడగగా… ఫిర్యాదుదారుడు లంచం ఇచ్చేందుకు ఇష్టం లేక ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు.
సోమవారం ఉదయం ఏసిబి డి యస్ పి ఆధ్వర్యంలో లో ఒంగోలు మునిసిపల్ కార్యాలయం అకౌంట్ సెక్షన్ నందు ఫిర్యాదు దారుని వద్దనుండి పదివేల రూపాయల లంచం తీసుకొంటుండగా పక్కా ప్రణాళికతో ఒంగోలు ఏసిబి డి.యస్.పి టివివి ప్రతాప్ కుమార్ మరియు ఇన్సిపెక్టర్స్ ఎన్.ఎస్.ఎస్ అపర్ణ, టివి శ్రీనివాసరావు, సిహచ్ శేషులు మరియు సిబ్బంది పట్టుకొన్నారు.