34.7 C
Hyderabad
May 4, 2024 23: 38 PM
Slider సంపాదకీయం

రాధాకృష్ణ… ఓపెన్ హార్ట్… ఓ షర్మిలక్క…

#openheartwithrk

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రేమగా చూసుకునే ఆయన చెల్లెలు వై ఎస్ షర్మిల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏమిటి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వార్తల యుద్ధం చేస్తున్నారు.

మరి అలాంటి ఛానెల్ కు షర్మిల ఇంటర్వ్యూ ఇవ్వడం జగన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘అక్కా నువ్వు ఏం చేస్తున్నావో అర్ధం అవుతున్నదా?’’ అంటూ జగన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరైతే షర్మిలను ఏమీ అనలేక రాధాకృష్ణ ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే షర్మిలను ఏమీ అనలేక రాధాకృష్ణ పై విషం కక్కుతున్నారు.

రాధాకృష్ణ పై తప్పుడు ఆరోపణలతో అక్కసు

రాధాకృష్ణ గతంలో వంగవీటి రంగాకు డ్రైవర్ గా పని చేసినట్లు తప్పుడు సమాచారం తో ట్విట్టర్ లో చండాలపు కామెంట్లు చేస్తున్నారు. ఇలా కామెంట్లు చేస్తున్న వారందరూ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు డిపిలుగా పెట్టుకున్నవారే.

ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ ‘‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’’ అనే కార్యక్రమ చేస్తుంటారు. ఇది ఎంతో పాపులర్ ప్రోగ్రాం. కొద్ది విరామం తర్వాత ఆయన ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నారు. మళ్లీ ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమంలో ముందుగా వై ఎస్ షర్మిలతో ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రోమో విడుదల చేశారు.

ఈ కార్యక్రమం ఈ ఆదివారం రాత్రి 8.30కి ప్రసారం కాబోతున్నది. షర్మిలక్క రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇవ్వడమనేది జగన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ షర్మిలకు జగన్ కు మధ్య విభేదాలు తలెత్తాయని తొలి సారిగా రాసింది రాధాకృష్ణ కు చెందిన ఆంధ్రజ్యోతి. కుటుంబంలో తలెత్తిన విభేదాలు, అన్నపై కోపం తదితర కారణాలతో షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టబోతున్నారని కూడా ఆంధ్రజ్యోతి వార్త రాసింది.

ఈ వార్తను ముందుగా ఎవరూ నమ్మలేదు. జగన్ అభిమానులైతే తీవ్రంగా ఖండించారు. జగన్, షర్మిల తల్లి విజయలక్ష్మి ఈ అంశంపై వివరణ ఇచ్చుకున్నారు. అయినా సరే ఆంధ్రజ్యోతి తన వార్తకు కట్టుబడింది. తాము రాసింది కరెక్టేనని అప్పటిలో చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో షర్మిల తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టేశారు.

ఆంధ్రజ్యోతి రాసింది కరెక్టు అని తేలింది

షర్మిల పార్టీకీ తమకు సంబంధం లేదని వైసీపీ కీలకనాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి ఆలశ్యం చేయకుండా చెప్పేశారు. షర్మిలకు, జగన్ కు అసలు పొసగడం లేదని వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా పబ్లిక్ గా వెల్లడి అయింది.

ఆ నాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల్ని చాలా మంది నమ్మడం ప్రారంభించారు. రాధాకృష్ణ సతీమణి ఆకస్మిక మరణం సంభవించినప్పుడు షర్మిల, వై ఎస్ జగన్ బాబాయి, దారుణ హత్యకు గురైన వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాధాకృష్ణను పరామర్శించారు.

షర్మిల, సునీత ఆయనను పరామర్శించిన తర్వాత తప్పని పరిస్థితుల్లో జగన్ కూడా రాధాకృష్ణను పరామర్శించారు. ఇవన్నీ జగన్ అభిమానులకు మింగుడు పడని అంశాలే. రాధాకృష్ణ తన పత్రిక ద్వారా, టివి ఛానెల్ ద్వారా ఏపిలో జరిగే తప్పులను ప్రతి రోజూ ఎత్తి చూపుతూనే ఉన్నారు.

ఒక రకంగా జగన్ ప్రభుత్వంపై వార్తలతో యుద్ధం చేస్తున్నారు. జగన్ కూడా ఆంధ్రజ్యోతిపై కేసులు పెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె’’ మూడో సీజన్ ప్రారంభం అవుతుండగా తొలి ఇంటర్య్వూ షర్మిలతోనే ఆయన చేస్తున్నారు. రాధాకృష్ణపై అత్యంత నీచమైన కామెంట్లు చేస్తూ జగన్ అభిమానులు తమ ఉక్రోషం ప్రదర్శిస్తున్నారు.    

Related posts

నేటి నుంచి ఇంటి వద్దకే ఇసుక పథకం ప్రారంభం

Satyam NEWS

తోపుడు బండి అందజేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

Satyam NEWS

చివ‌రి షెడ్యూల్లోకి ఎంట‌రైన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’

Satyam NEWS

Leave a Comment