ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లో ఒక పసికందు మరణించడం ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. సత్తుపల్లి పట్టణంలోని న్యూ స్టార్ పిల్లల వైద్యశాల లో ఈ దుర్ఘటన జరిగింది. వైద్యం వికటించడం వల్ల తమ నాలుగు నెలల బాబు మృతి చెందాడని తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు.
ఓవర్ డోస్ మెడిసిన్ వాడటం వల్లనే బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన బాబు బంధువులు హాస్పటల్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.